Petrol Diesel Price Hike: దేశంలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఆదివారం (ఏప్రిల్ 3) పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గత 13 రోజులుగా ఇంధన ధరలు రూ. 8 వరకు పెరగడం గమనార్హం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ను రూ. 103.41 కు విక్రయిస్తుండగా.. డీజిల్ ధర రూ. 94.67 గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 118.41.. డీజిల్ ధర రూ. 102.64గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ నగరాల్లో..


చెన్నైలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 108.96, రూ. 99.04గా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 113.03, డీజిల్ ధర రూ. 97.82గా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో ఇలా..


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై అత్యధికంగా 91 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 117.21కు చేరుకుంది. డీజిల్ పై 87 పైసల భారంతో రూ. 103.3కు ఎగబాకింది. 


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో పెట్రోల్ ధర 87 పైసలు ఎగబాకి.. రూ. 119.07కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 84 పైసలు పెరిగి.. రూ.104.78 కు ఎగబాకింది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.79గా ఉండగా.. డీజిల్ ధర రూ. 103.54గా ఉంది.  


Also Read: Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి RE ఎలక్ట్రిక్ బైక్!


Also Read: Petrol Diesel Price Hike: మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు.. 12 రోజుల్లో రూ. 7.20 పెంపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook