Stock Market Update: స్టాక్ మార్కెట్లు గురువారం (Stocks closing bell) కూడా నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) 372 పాయింట్లు కోల్పోయి 59,636 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 134 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్లు నష్టాలను మూటగట్టుకోవడం వరుసగా ఇది మూడో సెషన్​.


దాదాపు అన్ని రంగాలు డీలా పడ్డాయి. బ్యాంకింగ్ షేర్లు కాస్త స్థిరంగా కొనసాగాయి. ఆటోమొబైల్, ఐటీ షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూలతలు కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,177 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,376 కనష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,945 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,688 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.


Also read: బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


ఎస్​బీఐ అత్యధికంగా 1.16 శాతం లభాపడింది. పవర్​గ్రిడ్​ 0.63 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 0.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.35 శాతం, హెచ్​యూఎల్​ 0.16 శాతం పుంజుకున్నాయి.


ఎం అండ్ ఎం అత్యధికంగా 3.28 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా 3.21 శాతం, హెచ్​సీఎల్​టెక్ 2.88 శాతం, ఎల్​ అండ్ టీ 2.74 శాతం, టాటా స్టీల్​ 2.72 శాతం నష్టపోయాయి.


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 6 కంపెనీలు లాభాలను గడించాయి. 24 కంపెనీలు నష్టపోయాయి.


Also read: డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం- అప్లోడ్​లో వొడాఫోన్ ఐడియా జోరు!


Also read: రాకేశ్ ఝున్​ఝున్​వాలా బడ్జెట్ ఎయిర్​లైన్​ 'ఆకాశ' రెండు భారీ డీల్స్​!


పేటీఎం ఫ్లాప్ లిస్టింగ్​...


భారీ అంచనాలలతో లిస్టింగ్​కు వచ్చిన పేటీఎం (వన్​97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్​) మదుపరులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐపీఓలో అదరొగట్టిన పేటీఎం (Paytm IPO) తొలి రోజు లిస్టింగ్​ను భారీ నష్టాలతో ప్రారంభించింది. ఆరంభంలోనే 9 శాతానికిపైగా పడిపోయింది. చివరకు 27.25 శాతం నష్టంతో రూ.1,564 వద్ద ముగిసింది. ఐపీఓ ధరతో పోలిస్తే మదుపరులకు రూ.585 నష్టాన్ని మిగిల్చింది.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. థైవాన్​ సూచీ లాభాలను గడించింది. 


 షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), హాంకాంగ్, సూచీలు భారీగా నష్టపోయాయి.


డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 0.04 శాతం తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.23 వద్ద కొనసాగుతోంది.


Also read: 2021-22 క్యూ4లో ఎల్​ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్​యూల ప్రైవేటీకరణ కూడా!


Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook