Chhattisgarh Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాటపరాలోని ఖమారియా గ్రామ సమీపంలో ట్రక్కు మరియు పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా.. దాదాపు 10 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం బాలోద్ బజార్-భాటపరా రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులంతా సిగ్మాలోని ఖిలోరా గ్రామవాసులుగా తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ భాటపరా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 


బస్సు ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ మెహిదీపట్నం వద్ద ప్రార్థనలకు హాజరయ్యేందుకు చర్చికి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్‌పల్లి రాజేంద్రనగర్‌కు చెందిన ఆర్‌ శ్రీధర్‌ (58) అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై ఖైరతాబాద్‌లోని చర్చికి వెళ్తున్నాడు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సమీపంలోకి రాగానే బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. స్పాట్ లోనే అతడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.


Also Read: Kishan Reddy's Nephew Death: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook