Man Kills Wife: కామాంధుల క్రూరత్వం ముందు బయటి మహిళలకే కాదు.. సొంత ఇంటి మహిళలకు కూడా రక్షణ కరువైంది అని నిరూపించిన ఘటన. ఇంట్లోంచి బయటికి వెళ్లిన మహిళ.. తిరిగి ఇంటికొచ్చే వరకు రక్షణ లేకుండాపోయింది అని అనేది నాణేనికి ఒకవైపు అయితే.. చివరకు ఇంట్లో ఉన్న మహిళకు సొంతింటి వారి నుంచి కూడా రక్షణ లేదు అని ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. మే 20వ తేదీన హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మే 20న ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన పోలీసులు.. "తనకు ఏమీ తెలియదని బుకాయించిన ఆమె భర్తే అసలు కిరాతకుడని.. అతడే ఆమెను హత్య చేసి ఏమీ తెలియదు" అని డ్రామాలు ఆడుతున్నాడని ఆ హత్య జరిగిన 10 రోజుల్లోనే పోలీసులు నిగ్గు తేల్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏం జరిగింది అంటే.. మే 20న రాత్రి వేళ శ్రావణితో (పేరు మార్చడం జరిగింది) ఆమె భర్త సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆమె తన రెండో కాన్పులో డెలివరి అయి నెల రోజులే అవుతోంది. డెలివరి అయిన తరువాత కలిగే అనారోగ్యం, అలసటతో ఇబ్బంది పడటంతో పాటు పసి కందు సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్న శ్రావణికి లైంగిక సంపర్కంలో పాల్గొనేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదు అని చెప్పి సున్నితంగానే తిరస్కరించింది. 


అయితే, తన భార్య శ్రావణి ఇబ్బందిని అర్థం చేసుకోని ఆమె భర్త ఆమెపై బలత్కారం చేయబోయాడు. అందుకు ఆమె ప్రతిఘటించి ససేమిరా అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ఆ మానవ మృగం.. ఆమె తను కట్టుకున్న భార్య మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అనే ఇంగితం కూడా మర్చిపోయి విచక్షణారహితంగా కొట్టి చంపాడు. శ్రావణి ప్రాణాలు కోల్పోయిన తరువాతే తాను ఏం చేశానో అతడికి తెలిసొచ్చింది. వెంటనే శ్రావణి కండిషన్ గురించి తన బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది అని డాక్టర్లు స్పష్టంచేశారు.  


ఇది కూడా చదవండి: Thief Booked Cab to Escape: వ్యాపారి ఇంట్లో చోరీ.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ పరారీ.. అరెస్ట్


తన కూతురు శ్రావణి మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. శ్రావణి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు.. కేసు నమోదు చేసుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, శ్రావణి మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె భర్త బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు శ్రావణి మృతదేహం పరిశీలించినప్పుడు ఆమె మెడపై గోర్లు గుచ్చుకున్న గాయాలు స్పష్టంగా కనిపించాయి. పోస్ట్ మార్టం నివేదికలోనూ ఆమె హత్యకు గురైనట్టు స్పష్టంగా తేలడంతో సైదాబాద్ పోలీసులు శ్రావణి భర్తను అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. సెక్సుకి అంగీకరించకపోవడం వల్ల తానే తన భార్యను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.


ఇది కూడా చదవండి: Illegal Affairs: అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు మరో పెళ్లి చేసుకోకుండా..
ఇది కూడా చదవండి: Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook