Woman Murder In Hyderabad: హైదరాబాద్‌లో మహిళ హత్య కేసు సంచలనం రేకిత్తిస్తోంది. మహిళ తల, మొండె వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికి నిందితుడు హత్య చేశాడు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ఈ హత్య కూడా జరిగింది. ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను స్టోన్ కటింగ్ మిషన్‌తో ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. దాదాపు వారం రోజుల పాటు గాలించారు. 100 అనుమానాస్పద వాహనాలను విచారించారు. ఎట్టకేలకు ఓ చిన్న క్లూతో నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 17న నగరంలోని మూసీ నది సమీపంలో ఒక మహిళ తల తెగిపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు.. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ ఆటోలో ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి తలను పాడేసినట్లు అనుమానించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. 8 బృందాలుగా ఏర్పడి.. దాదాపు వారం రోజులపాటు 100 అనుమానస్పద వాహనాలను విచారించారు. ఎట్టకేలకు నిందితుడు వచ్చిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన అడ్రస్‌తో నిందితుడి అడ్రస్‌కు చేరుకుని అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.


కేసు వివరాలు ఇలా..


అనురాధారెడ్డి అనే మహిళతో నిందితుడు చంద్రమోహన్‌ (48) సహజీవనం చేస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన మహిళ.. చంద్రమోహన్‌తో కలిసి నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె వడ్డీకి డబ్బులు ఇస్తూ వ్యాపారం నిర్వహించేది. అనురాధారెడ్డితో చంద్రమోహన్ రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి తీసుకువచ్చేది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అనురాధారెడ్డిపై పగ పెంచుకున్న చంద్రమోహన్.. ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 12న మరోసారి గొడవ జరగ్గా.. ఆమెపై కత్తితో దాడి చేసి.. ఆమె ఛాతీ, కడుపుపై ​​పొడిచి హత్య చేశాడు.


హత్య చేసిన తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి పారవేసేందుకు రెండు చిన్న స్టోన్ కటింగ్ మిషన్లను కొనుగోలు చేశాడు. మొండెం, తలను వేరు చేసి.. తలను నల్లటి పాలిథిన్ కవర్‌లో పెట్టాడు. అనంతరం వారి కాళ్లు, చేతులను నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. దుర్వాసన రాకుండా.. ఫినైల్, డెటాల్, పెర్ఫ్యూమ్, అగర్బత్తీలు అన్ని వాడేశాడు. ఈ నెల 15న ఆటోలో వచ్చి మూసీ నది సమీపంలోకి  తలను పారేసి వెళ్లిపోయాడు. ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి.. మిగిలిన శరీర భాగాలను పారవేసేందుకు రెడీ అయ్యాడు.


ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫ్రిజ్‌లో దాచిన ఉంచిన మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహిళను హత్య చేసినట్లు నిందితుడు చంద్రమోహన్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.  


Also Read: Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?  


Also Read: Indian Railways Facts: ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్.. ఎందుకంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook