Man Kills Woman Chops Body Into Pieces: జమ్మూ కాశ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ శ్రద్దా వాకర్ హత్య కేసు తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను హత్య చేసిన నిందితుడు.. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పాడేశాడు. బుద్గామ్ జిల్లాలోని సోయిబుగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ అదృశ్యమైనట్లు నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 8న బుద్గామ్‌లోని సోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ తన సోదరి (30) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 7న కోచింగ్ క్లాస్‌లకు వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదని చెప్పాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితులను విచారించారు. వీరిలో మోహన్‌పురాకు చెందిన షబ్బీర్ అహ్మద్ వని (45)అనే వ్యక్తి నేరం చేసినట్లు అంగీకరించాడు. ఇతను వృత్తి రీత్యా కార్పెంటర్.


మహిళను హత్య చేసిన షబ్బీర్.. నేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. శనివారం వివిధ ప్రదేశాల నుంచి అన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే బ్రిడ్జి, ఓంపురా, సెబ్డెన్ వంటి వివిధ ప్రదేశాలలో పారవేసాడని చెప్పారు. అక్కడ నుంచి ఆమె తల, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిన్న రాత్రి మృతదేహంలోని అన్ని ముక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అంత్యక్రియల నిమిత్తం బంధువులకు అప్పగించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కాగా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను పోలీసులు ఇంకా చెప్పలేదు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. 


హత్యకు అసలు కారణం ఇంకా తెలియదు. నిందితుడు ఇంతకుముందు పెళ్లి కోసం తమ కుటుంబాన్ని సంప్రదించాడని.. అయితే మహిళ ప్రతిపాదనను తిరస్కరించిందని బంధువులు ఆరోపించారు. టైల్స్‌కు సంబంధించిన కొన్ని పనుల నిమిత్తం అతను ఇంటికి వచ్చేవాడని తెలిపారు. 


గతేడాది ఢిల్లీలో శ్రద్దా వాకర్‌ను ఆమె బాయ్‌ ఫ్రెండ్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేసి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పాడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది. తాజాగా మరోసారి అలాంటి ఘటన చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 


Also Read: IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..  


Also Read: Virat Kohli: మూడేళ్ల తరువాత నెరవేరిన కోరిక.. అహ్మదాబాద్‌లో కోహ్లీ చారిత్రాత్మక ఇన్నింగ్స్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి