Siddipet Collector Gunman Suicide News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. కలెక్టర్ గన్‌మెన్ నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం విధులకు హాజరు కాకపోవడంతో అనుమానంతో నరేష్ ఇంటికి వెళ్లి చూడగా.. కుటుంబం అంతా విగతజీవులుగా కనిపించారు. వివరాలు ఇలా.. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్ల గ్రామంలో నివాసం ఉంటున్న నరేశ్‌.. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య చైతన్య, కుమార్తె హిమశ్రీ, కొడుకు రేవంత్ ఉన్నారు. శుక్రవారం ఉదయం విధులకు రాకపోవడంతో ఇంటి వద్ద గమనించగా.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి నరేశ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోటీసులు ఘటనాస్థలికి చేరుకున్న వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణాలు ఉన్నాయా..? మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్ నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సీపీ శ్వేత తెలిపారు. అయితే ఆన్‌లైన్  బెట్టింగ్‌ల వల్లే నరేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. ఉదయం స్కూల్‌కు వెళ్లిన పిల్లలను కోపంతో ఇంటికి తీసుకొచ్చి మరీ నరేశ్ కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం నరేశ్ రూ.80 లక్షల అప్పు చేసినట్లు తెలుస్తోంది.