Extramarital Affair Murder: ఆ వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం మహిళ బంధువులకు తెలియడంతో హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. తమ్ముడిని హత్య చేస్తారని తెలుసుకున్న అన్న.. తమ్ముడిని గ్రామం నుంచి పంపించేశాడు. దీంతో వారి కక్ష తమ్ముడి మీద నుంచి అన్న మీదకు షిఫ్ట్ అయింది. దూరంగా తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, పురుషోత్తం అన్నదమ్ములు. ఇద్దరు బెంగుళూరులో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్లుగా ఉద్యోగాలు సంపాదించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అవ్వగా.. అన్న నాగరాజు తిరుపతిలో ఉంటూ వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. తమ్ముడు పురుషోత్తం గ్రామంలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పురుషోత్తానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మహిళ బంధువులకు తెలియడంతో శివరాత్రి రోజు పురుషోత్తంతో గొడవకు దిగారు. అప్పుడే అతడిని హత్య చేయాలని ప్లాన్ వేశారు.


తమ్ముడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారనే విషయం తిరుపతిలో ఉన్న అన్న నాగరాజుకు తెలిసింది. దీంతో వెంటనే బ్రాహ్మణపల్లికి వచ్చి తమ్ముడిని బెంగుళూరుకు పంపించాడు. పురుషోత్తంను కనిపించకుండా చేశాడని ఆ మహిళ బంధువులు నాగరాజుపై కక్ష కట్టారు. ఈ క్రమంలో శనివారం నాగరాజు తల్లిదండ్రులను చూసేందుకు రాగా.. మహిళ బంధువులు పంచాయితీ పెట్టారు. తన తమ్ముడు పురుషోత్తంతో బహిరంగా క్షమాపణలు చెప్పిస్తానని.. గొడవలు వద్దంటూ మహిళ బంధువులతో నాగరాజు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా నాగరాజును మహిళ బంధువులు రిపుంజయ, చాణక్య ప్రతాప్‌ మరో ఇద్దరు కలిసి కారులో తీసుకువెళ్లారు.


రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి సమీపంలో కారును ఆపారు. కురుపకణం వద్ద ఒకవైపు గుట్ట.. మరోవైపు లోయ ఉండడంతో నాగరాజును కిందకు దింపి చితకబాదారు. అనంతరం కాళ్లు చేతులు కట్టేసి కారులో కూర్చొపెట్టారు. అనంతరం కారు డోర్లు లాక్ వేసి.. నాగరాజుపైనా.. కారుపైనా పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం కారును లోయలోకి తోసేందుకు యత్నించగా.. కారు ముందు టైర్‌కు రాయి తగిలి ఆగిపోయింది.


ఈలోపు మంటలు భారీ వ్యాపించడంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు. మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పినా.. అప్పటికే కారుతోపాటు నాగరాజు కాలిపోయాడు. కారు నంబరు ప్లేటు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


Also Read: Viral Video: బికినీ ధరించి మెట్రోలో యువతి ప్రయాణం.. నెట్టింట వీడియో వైరల్


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి