Aadhi Pinisetty Engagement: కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి కొన్నేళ్ల క్రితం 'మరకతమణి' అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ షూటింగ్ అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహలను నిజం చేస్తూ వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ.. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మార్చి 24న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను వీరిద్దరూ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో వీరికి పలువురు సినీ ప్రముఖులు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 



2015లో విడుదలైన 'యాగవరైనమ్‌ నా కక్కా' అనే తమిళ చిత్రంలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. ఆ తర్వాత 'మరగాధ నాణ్యం' (తెలుగులో 'మరకతమణి') మూవీ షూటింగ్ అప్పుడు పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు ప్రణయానికి దారి తీసింది. నిక్కీ గల్రానీ తెలుగులో సునీస్ సరసన 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది.  


ALso Read: Ananya Nagalla Photos: అందంతో మతిపొగ్గొట్టేస్తుంది 'వకీల్ సాబ్' పోరి!


Also Read: Mahesh Babu on RRR: థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ర్యాంపేజ్.. మూవీ టీమ్ కు సూపర్ స్టార్ సలామ్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook