జర్నీ సినిమాలో పట్నం తెలియని అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన హీరోయిన్ అనన్య గుర్తుంది కదా ? అవున్లెండి ఎందుకు గుర్తుండదు.. ఎందుకంటే ఆ సినిమాతో అంజలితో కలిసి నటించిన అనన్యకు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే, అంజలిలా తెలుగునాట వరుస అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అనన్య బాగా వెనుకబడిపోయింది. ఆమధ్య త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాలో నితిన్‌కి సోద‌రిగా నటించి మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉందట. అందుకు కారణం కేర‌ళ వ‌ర‌దల్లో ఆమె ఇల్లు కూడా మునిగిపోవడమేనట. అవును ఈ విషయాన్ని అనన్యనే స్వయంగా వెల్లడించింది. శుక్రవారం వరకు తమ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. శుక్రవారంనాడు ఒకేసారి వరద ఉధృతి బాగా పెరిగిందని, ఆ వరదల్లో తమ ఇల్లు, తమ బంధువుల ఇల్లు కూడా నీట మునిగిపోయాయని అనన్య ఆవేదన వ్యక్తంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


రెండు రోజుల పాటు అలాగే ఆ వరద నీళ్లలో నరకం అనుభవించిన తర్వాత చివరకు ఎలాగోలా మరో నటి ఆశా శరత్ ఇంట్లో ఆశ్రయం పొందినట్టు అనన్య ఫేస్ బుక్ వీడియో ద్వారా తెలిపింది. అనన్య పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఫేస్ బుక్ లో భారీ స్పందన కనిపించింది. అనన్యకు ధైర్యం చెబుతూ ఆమె అభిమానులు సందేశాలు పంపించారు.