చెన్నై శివారులోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి భారతీయుడు 2 (#Indian2Shooting) సినిమా షూటింగ్‌ సెట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడటంతో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు (29)  మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్‌లోనే ఉన్న నటి కాజల్ అగర్వాల్ భయానక ఘటనపై స్పందించారు. క్షణాల్లో ఏమైనా జరగవచ్చునని, అదృష్టం బాగుండి ప్రాణాలతో ఉన్నానని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం



‘నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. గతరాత్రి జరిగిన ఘటనను అంత తేలికగా మరిచిపోలేం. క్షణాల్లో ఏమైనా జరిగిపోతుంది. అదృష్టం బాగుంది కనుక నేను ఇప్పుడు ఈ విషయపై ఇలా చేస్తున్నాను. లేకపోతే ఏం జరిగేదో. ఈ విషాదం నుంచి జీవితం, సమయం విలువ తెలుసుకున్నానని’ భావోద్వేగంతో కాజల్ అగర్వాల్ షూటింగ్ ప్రమాదం ఘటనపై ట్వీట్‌లో రాసుకొచ్చారు.


Also Read: ముగ్గురు సహోద్యోగుల్ని కోల్పోయా: కమల్ హాసన్ భావోద్వేగం 



‘ఆ భయానక ఘటనను మాటల్లో చెప్పలేను. నా బాధను చెప్పడం కష్టమైన పని. అప్పటివరకూ నాతో కలిసి పనిచేసిన ముగ్గురు కొలీగ్స్‌ కృష్ణ, చంద్రన్, మధులను కోల్పోయాం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. భగవంతుడు ఆ ముగ్గురి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని’ కాజల్ ట్వీట్ చేశారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..