ఉగాది పర్వదినం సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారం అయిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ రష్మి, కమెడియన్ సుధీర్ పెళ్లి చేసుకున్నట్టుగా చూపించడంతో నిజంగానే ఆ ఇద్దరికీ పెళ్లయిందా అనే చర్చ మొదలైంది. ఆ పెళ్లి కేవలం ఆ కార్యక్రమం వరకే పరిమితం అయినప్పటికీ.. నిజంగానే మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ రష్మీ అభిమానులు ట్విటర్‌లో ఆమెని ప్రశ్నించడం మాత్రం మానడం లేదు. అలా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన రష్మి.. " ఆ షో చివరి వరకూ చూస్తే, అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది" అని బదులు ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే, రష్మీ అలా బదులు ఇచ్చిన తర్వాత సైతం రష్మీ, సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ మాత్రం ఆగడం లేదు. షో మొత్తం చూసినప్పటికీ.. అక్కడ తమకు ఎటువంటి స్పష్టత రావడం లేదు కనుకే ఇలా ట్విటర్ ద్వారా అడుగుతున్నాం అంటూ ఇంకొంత మంది నెటిజెన్స్ కామెంట్స్ ఇచ్చారు. దీంతో మొత్తానికి రష్మీ, సుధీర్‌ల పెళ్లి సోషల్ మీడియాలో ఓ వైరల్ టాపిక్‌గా మారింది.