గత పదేళ్లకుపైగా నుంచి హిందీ టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టంట్స్ మధ్య రాజకీయాలు, గొడవలు, చిలిపి తగాదాలు, అల్లరి, ఏడుపులు, అరుపులు, పెడబొబ్బలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే ఒకటేమిటి! ఎన్నో వింతలు, విశేషాల సమాహారమే ఈ రియాలిటీ గేమింగ్ షో. ఇప్పటివరకు బిగ్ బాస్ 11 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే 12వ సీజన్ తెరపైకి రానుంది. సల్మాన్ ఖాన్ నటించిన 12వ సీజన్ ప్రోమో సైతం ఇటీవలే రిలీజై, టీవీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిగ్ బాస్ 12వ సీజన్‌లో పాల్గొనబోయే అభ్యర్థులు ఎవరా అనే ప్రచారం ఊపందుకుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొననున్నారని టాక్ వినిపిస్తుండగా తాజాగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఆరుగురి పేర్లను బిగ్ బాస్ పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రముఖ వివాదాస్పద మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ శ్రీశాంత్ (క్రికెటర్)
దివ్యా అగర్వాల్ (టీవీ నటి, మోడల్)
తనుశ్రీ దత్తా (బాలీవుడ్ నటి)
స్కార్లెట్ ఎం రోజ్ (ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7 విజేత)
శ్రిష్టి రోడ్ (టీవీ నటి)
కరన్‌వీర్ బోహ్రా (ప్రముఖ టీవీ నటుడు)


మొత్తం 14 మంది అభ్యర్థుల్లో ఈ ఆరుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు హిందీ వెండితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.