Sherlyn Chopra: బాలీవుడ్ నటి షెర్లిన్‌ చోప్రాపై శిల్పాశెట్టి,  రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు రూ. 50 కోట్ల పరువు నష్టం(Defamation Case) దావా వేశారు. రాజ్‌కుంద్రాపై షెర్లీ(Sherlyn Chopra) చేసిన ఆరోపణలు నిరాధారమని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రా(rajkundra)పై కేసు పెట్టిన షెర్లిన్‌ లైంగికంగా, మానసికంగా తనని వేధిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి ఎఫ్.ఐ.ఆర్‌.(FIR) నమోదు చేయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Case Filed Against Mohan Babu:'మా' గొడవలో మోహన్ బాబు.. భద్రాద్రి కొత్తగూడెంలో కేసు నమోదు


 తాజాగా ఈ కేసు విషయమై రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు షెర్లిన్‌పై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అవాస్తవమని, నిరూపించేందుకు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాని ఆకర్షించేందుకు ఇలా చేసిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అశ్లీల చిత్రాల తెరకెక్కిస్తున్నారనే కారణంగా రాజ్‌కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే.


పోర్నోగ్ర‌ఫీ ఆరోప‌ణ‌ల‌పై రాజ్‌కుంద్రాతోపాటు మ‌రో 11 మందిని గ‌త జూలై 19న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సెప్టెంబ‌ర్ 20న‌ ఈ కేసులో రూ.50 వేల పూచీక‌త్తుపై రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి