Tiger 3 Teaser: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ 3' అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు స్నీక్ పీక్‌తో ఉత్సాహాన్ని నింపాడు. యాక్షన్-థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. నవంబర్ 10న , 2023 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ మరియు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ రోజుహీరో సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా థ్రిల్లింగ్ టీజర్‌ను విడుదల చేసి.. సినిమాలో ఉన్న తన పాత్ర గురించి మరింత ఆసక్తి పెంచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'టైగర్ కా మెసేజ్' పేరుతో రూపొందించిన ఈ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. YRF స్పై యూనివర్స్ యొక్క OG గూఢచారి..  అవినాష్ సింగ్ "టైగర్" రాథోడ్‌గా సల్మాన్ ఖాన్ తిరిగి వచ్చాడు. భారత ప్రభుత్వానికి తన 20 ఏళ్ల సేవ తర్వాత తాను ప్రతిఫలంగా ఏమీ కోరలేదని సల్మాన్ ఖాన్ ప్రకటించడంతో వీడియో ప్రారంభమవుతుంది. అతను 'టైగర్ గద్దర్ హై.. అంటే టైగర్ ఒక దేశ ద్రోహి అనటం.. టైగర్ శత్రువు నంబర్ 1' అని చెప్పడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పులు వినిపిస్తున్నప్పటికీ సల్మాన్ వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సల్మాన్ డజన్ల కొద్దీ గన్ లతో.. సైనికులతో పోరాడుతున్నట్లు వీడియో కొనసాగుతుంది. టీజర్‌లో 'జబ్ తక్ టైగర్ మారా నహీ, తబ్ తక్ టైగర్ హర నహీ'.. అంటే.. టైగర్ చనిపోనంత వరకు.. టైగర్ ఓడిపోనట్లు' అనే పంచ్‌లైన్ ఉంటుంది. 


Also Read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ



సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ నటించిన టైగర్ ఫ్రాంచైజీతో YRF స్పై యూనివర్స్ ప్రారంభమైంది, 'ఏక్ థా టైగర్' (2012), 'టైగర్ జిందా హై' (2017)తో మొదలై.. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' (2019)తో కొనసాగింది. ఈ ఈ స్పై యూనివర్స్ లో భాగంగా.. ఈ సంవత్సరం 'పఠాన్' సినిమా వచ్చింది. ఈ సినిమాలో షారుఖ్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా కనిపించిన సంగతి తెలిసిందే. YRF స్పై యూనివర్స్ లో  'టైగర్ 3' ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. YRF సంస్థ నిర్మిస్తున్న అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఇదీ ఒకటి మరియు ఈ సినిమా నిర్మాణానికి గానూ.. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి మనీష్ దర్శకత్వం వహించగా.. కత్రినాతో పాటు..  ఇమ్రాన్ హష్మీ నెగటివ్ పాత్రను పోషించబోతున్నాడని సమాచారం. అశుతోష్ రానా, రేవతి, రణవీర్ షోరే, రిద్ధి డోగ్రా మరియు వరీందర్ సింగ్ ఘుమాన్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. 


Also Read: Apple iPhone15: అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 15, ధర, ఇతర వివరాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook