Nitin Manmohan Hospitalized : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నితిన్ మన్మోహన్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, ఆయన పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఆ కారణంగా ఆయనని వెంటిలేటర్‌పై ఉంచారు. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు శనివారం (డిసెంబర్ 3) సాయంత్రం గుండెపోటు వచ్చింది, ఆ తర్వాత వెంటనే కోకిలా ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతానికి వైద్యులు అందిస్తున్న వైద్యానికి చిత్ర నిర్మాత స్పందిస్తున్నారని, అయితే ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని అంటున్నారు.. ఇక బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు నితిన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఆయనతోనే ఆసుపత్రిలో ఉన్నారు.


అదే సమయంలో, ఆయనని పరామర్శించేందుకు చాలా మంది ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నితిన్ బాలీవుడ్ ప్రముఖ నటుడు మన్మోహన్ కుమారుడు. 'బ్రహ్మచారి', 'గుమ్నామ్', 'నయా జమానా' వంటి చిత్రాలతో మన్మోహన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తండ్రిలానే నితిన్‌కు కూడా సినిమా పరిశ్రమతో అనుబంధం ఉందని అంటున్నారు. నితిన్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు.


'బోల్ రాధా బోల్', 'దస్', రెడీ వంటి సూపర్ హిట్ చిత్రాలు నితిన్ నిర్మించారు. మీడియా కథనాల ప్రకారం, అక్షయ్ ఖన్నా నితిన్ గురించి తెలిసిన వెంటనే, ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి అతని పరిస్థితి గురించి ఆరా తీశారు. అక్షయ్ నితిన్ నిర్మించిన 'గలీ గలీ చోర్ హై', 'దీవాంగి' మరియు 'సబ్ కుశాల్ మంగళ్' సహా పలు చిత్రాలలో కనిపించారు.


Also Read: Chandramohan: 1000 సినిమాలు చేసి అలా 100 కోట్లు నష్టపోయిన చంద్రమోహన్


Also Read: Nandini Rai : ఇంటిపైకెక్కి దూకాలనిపించేది.. వాళ్ల వల్లే బతికి బట్టకట్టా, నందిని సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook