Jr NTR Devara Part-1 Trailer Launch Event: జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్-1 మూవీ రిలీజ్‌కు అంతా రెడీ అయ్యింది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సందడి మొదలుపెట్టనుంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్-బన్నీ మధ్య స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు బావ బావ అని పిలుచుకుంటూ సరదాగా ఉంటారు. ఈ ఇద్దరు స్టార్స్ ఒకే స్టేజ్‌పై వస్తున్నారనే వార్తల నేపథ్యంలో మూవీ లవర్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. ముక్కున వేలేసుకుంటున్న నేతలు..  


అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. బన్నీ డేట్స్‌ను బట్టి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది. RRR తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. ఆచార్య ఫ్లాప్ తరువాత కొరటాల శివ ఎంతో కసితో తెరకెక్కిస్తుండడంతో దేవర మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మూవీ తరువాత హీరోలు నటించే సినిమాలు ఫ్లాప్ అవుతాయనే ముద్ర ఉంది. దేవరతో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని తారక్-కొరటాల ద్వయం పట్టుదలగా ఉంది. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దేవర మూవీ మేకర్స్ డిజైన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ నెట్టింట ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. 


ప్రమోషన్ వెనుక ఎమోషన్..


ఇక ఇద్దరు యంగ్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ  ఒకే తరహా సమస్య వచ్చి పడింది. తమ బ్యాక్ గ్రౌండ్‌గా చెప్పుకునే ఫ్యామిలీనే వారిని దూరం పెట్టారనే గుసగుసలు చిత్ర పరిశ్రమలో జోరందుకున్నాయి. దీనిని బలపరిచేలా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా దానిని బలపరుస్తున్నాయి. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ 50 వసంతాల సినీ ప్రస్థానం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి ఈ ఇద్దరూ దూరంగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దూరంగా ఉండడానికి కారణం ఫ్యామిలీస్‌తో ఉన్న గ్యాప్ అనేది ప్రచారం జరుగుతోంది. సినీ పరిశ్రమలో ఉన్న అందరినీ ఆహ్వానించిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం పిలవలేదు. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవవద్దని స్వయాన బాలకృష్ణే చెప్పారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరగడం సంచలనంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్‌కు కూడా ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ అందలేదు. దీనిపై కూడా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం అల్లు అర్జున్‌ను పిలవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్‌ చెప్పినట్లు టాలీవుడ్‌లో టాక్. ఇలా ఇద్దరు బాలకృష్ణ ప్రోగ్రాంకు దూరంగా ఉండిపోయారు.
 
అయితే ఇప్పుడు అదే ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదిక పంచుకోవడంపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమ అభిమాన హీరోలను సైడ్ చేద్దామనుకున్న వాళ్లకు ఈ ఇద్దరు కలవడంపై ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవాలి అనుకోవడమే తమకు పెద్ద సర్ ప్రైజ్ గా ఉందని ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఎందుకు వీళ్లు ఇలా ప్లాన్ చేశారా అని సిని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. యాధృచ్చికంగానే దేవర సినిమాకు అల్లు అర్జున్‌ను పిలిచారా లేక ఇంకా ఏదైనా ఇతరత్రా కారణం ఉందా అని సిని పరిశ్రమకు చెందిన వారు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే ఈ ఇద్దరిని నటసింహ బాలకృష్ణ ప్రోగ్రాంకు ఆహ్వానించలేదు. దీంతో ఇద్దరు ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు కలిసి తమ అభిమానులకు ఏ విధమైన మెసేజ్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


Also Read: Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.