Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం కల్గించిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో(Tollywood)సంచలనం కల్గించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. విదేశాల్నించి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో జరిగాయి, ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై వివరాల్ని సేకరించారు. పూరీ జగన్నాథ్‌కు సంబంధించి మూడు బ్యాంకు ఎక్కౌంట్లను పరిశీలించారు. పూరి జగన్నాథ్‌కు(Puri Jagannadh)సంబంధించి వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రిపోర్ట్‌లను పరిశీలించారు. ఈ కేసులో గతంలో అరెస్టైన నిందితుల వాంగ్మూలం ఆధారంగా పూరి జగన్నాథ్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. పూరి జగన్నాథ్ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేశారు. ఎప్పుడు పిలిచినా..విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.


Also read; AP Corona Vaccination: వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మైలురాయి దాటిన ఆంధ్రప్రదేశ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook