Rashmika Mandanna about Injured Fans At Pushpa Pre Release Event: 'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన కన్నడ భామ 'రష్మిక మందన్న'. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న రష్మిక.. 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నారు. ఆపై అనతికాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, సుల్తాన్ తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో రష్మిక (Rashmika Mandanna) స్టార్ హీరోయిన్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో రష్మిక నటించిన తాజా సినిమా  'పుష్ప' (Pushpa) మొదటి భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో తన అందంతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రీయేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పుష్ప సినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర బృందం ప్రోమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆదివారం ముందస్తు విడుదల వేడుకలు నిర్వహించారు. స్టార్ డైరెక్టర్స్ ఎస్‌ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు వచ్చారు. అయితే తోపులాట జరగడం వల్ల కొంతమంది ఫాన్స్ గాయపడ్డారు.


Also Read: Dish TV vs Yes Bank case: యస్ బ్యాంకు కుట్రలపై SEBI కి ఫిర్యాదు చేసిన డిష్ టీవీ


పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pushpa Pre Release Event)లో అభిమానులు గాయపడ్డారని తెలుసుకున్న హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) చాలా బాధపడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 'నిన్న సాయంత్రం జరిగిన పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈవెంట్‌లో తోపులాట జరగడం వల్ల కొంతమంది గాయపడ్డారని ఇప్పుడే నాకు తెలిసింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీ అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని భావిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి' అని రష్మిక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దాంతో ఫాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


Also Read: Stock Market today: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 503 పాయింట్లు డౌన్​


మరోవైపు 'పుష్ప' రిలీజ్‌ ఈవెంట్ లో రష్మిక మందన్న (Rashmika Mandanna) మాట్లాడుతూ... 'ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఈ చిత్రంలో కొత్త ప్రపంచాన్నే సృష్టించాం. పుష్ప అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను. అయితే సినిమా బాగా వచ్చిందనే సంతోషం ముందు అన్ని మరిచిపోయా. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది' అని అన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనుండగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన రష్మిక లుక్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి