ప్రశాంత్ నీల్. ఇప్పుడీ పేరు తెలియనివాళ్లేరు. కేజీఎఫ్ పాన్ ఇండియా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమయ్యాడు. ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ హఠాత్తుగా ట్విట్టర్‌కు దూరమైపోయాడు. కారణమేంటని ఆరా తీస్తే ఆశ్చర్యం వేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్ సినిమా అంత రఫ్ కాదు దర్శకుడు ప్రశాంత్ నీల్. బాగా సున్నిత మనస్కుడు అనుకుంటా. త్వరగా హర్ట్ అయ్యాడు. కేజీఎఫ్ తరువాత వరుసగా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లు చేతిలో ఉన్నాయి. ప్రభాస్‌తో తీస్తున్న సలార్ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కించనున్నాడు. కన్నడ నటుడు యశ్‌తో చేసిన తొలి సినిమాతో ప్రాచుర్యం పొంది..ఆ తరువాత కన్నడ హీరోలతో సినిమా చేయకపోవడంపై కన్నడ అభిమానులు హర్ట్ అయ్యారని సమాచారం. ప్రశాంత్ హీరో సినిమా చేయదగ్గ హీరో కన్నడలో లేడా అని ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. 


అదే సమయంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 అప్‌డేట్స్ కోసం నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు దురుసు కామెంట్లు కూడా చేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 3 అప్‌డేట్ ఇవ్వలేదని..కన్నడ హీరోలతో చేయడం లేదని ఇలా గట్టిగానే ప్రశాంత్ నీల్‌పై ట్రోలింగ్ జరిగింది. నెటిజన్ల ట్రోలింగ్ ప్రశాంత్ నీల్‌ను గట్టిగానే బాధపెట్టిందని తెలుస్తోంది. అందుకే మనస్సు నొచ్చుకుని ట్విట్టర్ ఎక్కౌంట్ క్లోజ్ చేసేశాడు. 


Also read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. గాడ్ ఆఫ్ మాస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook