'అజ్ఞాతవాసి' సినిమాపై ఆసక్తికరమైన కామెంట్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు సినీ నటి ఖుష్బూ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆజ్ఞాతవాసి'. ఇందులో ఖుష్బూ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే..! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నేను ఎంతో కాలం నుంచి ఇటువంటి పాత్ర, అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో అవకాశమిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్‌కు కూడా ధన్యవాదాలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. అందులో ఖుష్బూ చైర్ లో కూర్చొని సీరియస్ లుక్‌తో ఉండగా.. పక్కనే పవన్ కళ్యాణ్ నిల్చొని ఉన్నాడు. ఈ ఫోటో ఏ సన్నివేశానికో తెలుసుకోవాలనుంటే సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే..!  సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది.