Guntur Kaaram Second Single: సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘గుంటూరు కారం'(Guntur Kaaram). మాస్  ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, ఫ‌స్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 'ఓ మై బేబీ...' అంటూ సాగే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రయూనిట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

”అమ్ము.. ర‌మ‌ణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ” అంటూ ఈ ప్రోమో సాగుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పా రావు అలపించారు. ఈ మెలోడియస్‍ సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ ఫుల్ వెర్ష‌న్‌ను డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. 


అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది త్రివిక్రమ్ టీం. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.



Also Read: Animal Collections: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' కలెక్షన్ల ప్రభంజనం.. అప్పుడే రూ. 700 కోట్ల క్లబ్ లో రణ్​బీర్ మూవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి