టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో రంగస్థలం సినిమా రికార్డులను బ్రేక్ చేసిన భరత్ అనే నేను సినిమాకు తమిళనాడులోనూ మంచి స్పందన కనిపిస్తోంది. బాక్సాఫీస్ లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం తమిళనాడులో భరత్ అనే సినిమాకు 4.2 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అందులోనూ కేవలం చెన్నై సర్కిల్లోనే సినిమా 1.6 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకే అని కాకుండా తమిళనాడులో బాగా పర్‌ఫామ్ చేసిన తెలుగు సినిమాగా భరత్ అనే నేను సినిమాను విశ్లేషిస్తున్నాయి మార్కెట్ వర్గాలు.


టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌లోనూ దూసుకుపోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ సినిమాలో అతడి సరసన బాలీవుడ్ నటి కియారా అద్వాని జంటగా కనిపించింది.