Sarkaru vaari paata: మహేశ్ బాబు అభిమానులకు ఇది తాజా అప్‌డేట్. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేసిన ట్వీట్ అభిమానుల్లో సందడి రేపుతోంది. సర్కారువారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్ అభిమానుల కోసం విన్పించేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి రావల్సిన మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా సర్కారువారిపాట విడుదల ఆలస్యమైంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కన్పించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. మహేశ్ బాబు సరికొత్త లుక్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోనుంది. 


సినిమా ఆలస్యానికి చాలా కారణాలే ఉన్నాయి. మహేశ్ బాబు (Mahesh Babu)మోకాలికి సర్జరీ, ఆ తరువాత మహేశ్ బాబు, కీర్తి సురేష్‌లు కరోనా బారిన పడటంతో షూటింగ్ కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. సినిమా ప్రమోషన్ కూడా నిలిచిపోయింది. ఈ వేసవికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్కారువారిపాటకు ( Sarkaru vaari paata) సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌లో కుతూహలం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నుంచి కాకపోయినా..సంగీతం అందిస్తున్న తమన్ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. తమన్ (Taman) ట్విట్టర్ హ్యాండిల్‌పై ఓ చిన్న వీడియో పోస్ట్ చేశాడు. అభిమానులకు కావల్సిన కంటెంట్ ఉంది ఈ వీడియోలో. సర్కారువారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్‌ను కాస్సేపు ప్లే చేసి విన్పించాడు తమన్. అందుకే ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.



Also read: Samantha: ఆ ఇద్దరి వల్లనే సమంత ఇంకా బతికుందట, ఎవరా ఇద్దరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook