Jabardasth: జబర్దస్త్ లో కొత్త యాంకర్ ఎంట్రీ.. ఆ హాట్ భామకే అవకాశం?
New anchor entry in jabardasth: అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్టు క్లారిటీ రావడంతో కొత్త యాంకర్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆగస్టు 4వ తేదీ ప్రసారం అయ్యే ప్రోమోతో కొత్త యాంకర్ ఎవరు అనే విషయం మీద మరింత ఆసక్తి పెంచేశారు.
New Anchor entry in Jabardasth: సుదీర్ఘకాలంగా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ ఎట్టకేలకు షో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా గత ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేసింది. ఇక రాబోతున్న జబర్దస్త్ యాంకర్ ఎవరు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండడంతో ఆమెను జబర్దస్త్ లోకి తీసుకురావడం అయితే ప్రస్తుతానికి కుదిరే పని కాదు. దీంతో కచ్చితంగా కొత్త యాంకర్ ఎంట్రీ ఉంటుందని ముందు నుంచి అందరూ భావిస్తూ వస్తున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు కొత్త యాంకర్ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయిపోయింది. తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఈ విషయం క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ మేకర్స్ జబర్దస్త్ ఆగస్టు నాలుగో తేదీన ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో అత్యంత ఆసక్తికరంగా సాగింది. నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 సినిమా విడుదల సందర్భంగా నిఖిల్, శ్రీనివాస్ రెడ్డి అలాగే దర్శకుడు చందు మొండేటి ఈ షోకి హాజరయ్యారు. వారు కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు.
ఇక ఈ షోలో మనో స్థానంలో సంగీతను తీసుకువచ్చారు అలాగే ఇంద్రజ కూడా జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక ఈ వారం ఆసక్తికరంగా సాగిన స్కిట్స్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర సన్నివేశాలను చూపించారు. తర్వాత జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిందనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. పల్లకిలో తీసుకురావడమే గాక కమెడియన్ లందరూ ఒక పండగ వాతావరణంలో కొత్త యాంకర్ ను స్వాగతించినట్లు కనిపిస్తోంది. అయితే ఆ యాంకర్ ఎవరు అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
జబర్దస్త్ కమెడియన్లు అందరూ కలిసి ఆమెను పల్లకిలో మోసుకొచ్చి లోపలి కూర్చోబెట్టారు. కానీ ఆమె ఫేస్ ఎలా ఉంటుంది? ఆమె ఎవరు అనే విషయం మీద ఆసక్తి పెంచేశారు? బహుశా షో ప్రసారం కావడానికి ఒకటి రెండు రోజులు ముందు ఈ విషయాన్ని రివీల్ చేసే అవకాశం ఉంది. లేదా డైరెక్ట్ గా నాలుగో తేదీన ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ లోనే దాన్ని రివీల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వాళ్లు రివిల్ చేయలేదు.
కానీ ఈ కొత్త యాంకర్ మరెవరో కాదు నటి, యాంకర్ మంజూష అనే ప్రచారం జరుగుతుంది. గతంలో రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈవిడ ప్రస్తుతం పలు సినీ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. హాట్ షోలో ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోతున్న ఈ భామనే ఇప్పుడు యాంకర్ గా తీసుకొచ్చారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Nookaraju: క్యాష్ షోలో షాకింగ్ ఘటన.. చేతిలో కర్పూరం హారతి… తాళి కట్టేందుకు విఫలయత్నం!
Also Read: Commitment Movie: వివాదంలో కమిట్మెంట్ మూవీ.. కేసు నమోదు..ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook