స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు మరియు నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ఒక్క క్షణం’. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి వైవిధ్యమైన చిత్రాలను టాలీవుడ్‌‌కు అందించిన  వి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. లవ్ వర్సెస్ డెస్టినీ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రంలో శిరీష్‌ సరసన హీరోయిన్లగా సురభి, సీరత్‌ కపూర్ నటిస్తున్నారు‌.


అదేవిధంగా అవసరాల శ్రీనివాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ బాణీలు సమకూర్చిన ఈ చిత్రం లక్ష్మి నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సారథ్యంలో చక్రి చిగురుపాటి నిర్మించగా.. వేగెశ్న సతీష్ కథనూ, అబ్బూరి రవి మాటలను అందిస్తున్నారు. డిసెంబర్‌ ఆఖరి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.