సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 కధ ఏంటనేది లీకయింది. ఈ సినిమా కధకు సంబంధించి ఆసక్తికరమైన అంశాల్ని స్వయంగా సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ బహిర్గతపరిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జక్కన్న..మహేశ్‌బాబుతో సినిమా ప్రకటించడంతో అటు అభిమానుల్లో ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు ఇది 29వ సినిమా కావడంతో ఎస్ఎస్ఎంబీ 29గా ప్రస్తుతానికి పిలుస్తున్నారు. సర్వత్రా ఈ సినిమా ఆసక్తి ఉన్నా..షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందరూ ఈ సినిమాకై ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో సినిమా కధకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు రచయిత విజయేంద్ర ప్రసాద్. సినిమా కధ ఎలా ఉంటుంది..మహేశ్‌బాబునే హీరోగా ఎందుకు ఎన్నుకున్నారనే విషయంపై స్పష్టత ఇచ్చారు.


చాలాకాలం నుంచి రాజమౌళి భారీ ఎత్తున ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలని భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్టు సాంకేతిక బృందం ఇప్పటికే సిద్ధమైందని..ఈ కధకు మహేశ్‌బాబు మాత్రమే సరైన వ్యక్తిగా భావించడం వల్ల ఆయనను ఎంచుకున్నాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కధలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి వచ్చే సామర్ధ్యం మహేశ్‌కు ఉందంటున్నారు విజయేంద్ర ప్రసాద్. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర..సాహసాలు చేస్తూ వివిధ దేశాలకు తీసుకెళ్లే విధంగా ఉంటుందన్నారు. ఇక షూటింగ్‌ను 2023 మే లేదా జూన్ నెలలో ప్రారంభిస్తామని అప్‌డేట్ ఇచ్చారు. 


Also read: Kochu Preman: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook