Renu Desai New Year Celebrations రేణూ దేశాయ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని అందాలను చూస్తూ మురిసిపోతోంది. తన కూతురు ఆద్యతో కలిసి రేణూ దేశాయ్ నార్త్‌లో ఎంజాయ్ చేస్తోంది. కాశ్మీర్ కొండల్లో విహరిస్తూ గాల్లో తేలిపోతోంది. అయితే ఈ సారి అకిరా నందన్ మాత్రం వీళ్లిద్దరితో వెకేషన్‌కు వెళ్లలేదు. అకిరా నందన్ మాత్రం కొత్త ఏడాది వేడుకల్లో అభిమానులతో కలిసి ఖుషి సినిమాను మళ్లీ చూశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా అయితే ఈ ముగ్గురు కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు. కానీ ఇలా మొదటి సారి అకిరా నందన్‌ను ఇక్కడే వదిలిపెట్టి.. రేణూ దేశాయ్, ఆద్యలు మాత్రం న్యూ ఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. మొన్నటి వరకు విదేశాల్లో తిరిగి వచ్చారు ఈ ముగ్గురు.


 



రేణూ దేశాయ్ అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా ఉంది. రవితేజ నటిస్తున్న ఈ సినిమా స్టువర్ట్‌పురం దొంగల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే అఫీషియల్‌గా రేణూ దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్నట్టుగా మారింది. హేమలతా లవణం అనే పాత్రలో రేణూ దేశాయ్ కనిపించబోతోంది.


ఆద్య అనే ఓ వెబ్ సిరీస్‌ను కూడా రేణూ దేశాయ్ ఓకే చేసింది. కానీ ఇది కరోనా కంటే ముందు ప్రారంభించారు. కరోనా దెబ్బకు ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్టు తెలుస్తోంది. ఇంత వరకు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు.


Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి