Renu Desai Corona Positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు ఇండియాలోనూ కరోనా కేసులు భారీగా పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలతో పాటు నైట్ కర్ఫ్యూలు విధించారు. అయితే ఈ కరోనా మూడో వేవ్ లోనూ అనేక మంది ప్రముఖులు కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే అనేక రాజకీయ ప్రముఖులు సహా సినీ తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇటీవలే హీరో మహేష్ బాబు, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత బండ్ల గణేష్, హీరోయిన్ త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బుతో పాటు శోభన సహా పలువురికి కరోనా వైరస్ సోకింది. 


ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె స్వయంగా వెల్లడించారు. ఆమెతో పాటు కుమారుడు అకిరా నందన్ కు కూడా కరోనా సోకినట్లు ఆమె స్పష్టం చేశారు. 



అయితే కొన్ని రోజులుగా తాము కొవిడ్ లక్షణాలతో బాధపడినట్లు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం తాను, అకిరా నందన్ కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే తాను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. 


కానీ, తన కుమారుడు అకిరా నందన్ కు వ్యాక్సిన్ వేయించే లోపే కరోనా సోకినట్లు తేలిందని ఆమె అన్నారు. కరోనా మరోసారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.  


Also Read: Rashi Khanna Photos: వైట్ శారీలో అందాలతో ఊరిస్తున్న బెల్లం శ్రీదేవి


Also Read: Unstoppable With NBK: అన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం.. ఛార్మితో బాలయ్య..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook