Shaking Seshu Sensational Comments on Kiraak RP: గత కొంతకాలంగా జబర్దస్త్ మీద జబర్దస్త్ నిర్మాణ సంస్థ మల్లెమాల పైన ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అతను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే జబర్దస్త్ నుంచి హైపర్ ఆది రాంప్రసాద్ వంటి వారు బయటకు వచ్చి ఖండించారు. ఇప్పుడు తాజాగా షేకింగ్ శేషు అనే సీనియర్ కమెడియన్ కూడా బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని ఆర్పీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ వెల్లడించారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్పీకి ఇక్కడ ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కానీ వెళుతూ వెళుతూ సంస్థను దూషించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్పీ ఎలాంటివాడు అనే విషయాన్ని వెల్లడిస్తూ అతను చేసిన మోసాలను కూడా బయట పెట్టారు షేకింగ్ శేషు. నిజానికి కొంతకాలం క్రితం ఆర్పీ దర్శకుడిగా జీడీ చక్రవర్తి హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవం భారీ ఎత్తున జరగడంతో మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఆ సినిమా ఆగిపోయిందని సదరు సినిమా నిర్మాతకు ఆర్పీ 20 లక్షలు టోపీ పెట్టాడంటూ షేకింగ్ శేషు సంచలన ఆరోపణలు చేశారు.


సినిమా మొదలు కూడా కాకుండానే 50 వేల రూపాయల అద్దెకు ఒక ఆఫీస్ తీశాడని, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కానీ 20 లక్షల రూపాయల ఖర్చు చేయడంతో సదరు నిర్మాత లబోదిబోమంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. అతను సినిమా చేస్తుంటే బాగుపడ్డాడని భావించామని కానీ అతను మోసగాడని తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక ఆర్పీ తన హోమ్ టూర్ లో ఒక అద్భుతమైన ఇంటిని చూపించడం విషయం మీద కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.


సుమారు రెండు మూడు నెలల క్రితం ఆర్పీ ఒక ఇంద్ర భవనం లాంటి నివాసాన్ని తన స్వగృహం అంటూ హోమ్ టూర్ చేయడం మీద స్పందించిన షేకింగ్ శేషు ఈ విషయం మీద తన భార్య కూడా తనకు క్లాసు పీకిందని, వెళ్లి ఆర్పీ సంకనాకమని ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసిందని అన్నారు. ఆమె అలా అనడంతో నాకే బాధ అనిపించి అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ ఇల్లు సినీ పరిశ్రమలో అనేకమంది సెలబ్రిటీలకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వ్యక్తి ఇల్లని కేవలం షూటింగ్ తీసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసిందని అన్నారు..


అలా దాన్ని తన ఇంటిగా మోసం చేసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడని అలాంటి వ్యక్తి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ శేషు ప్రశ్నించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి రంగంలోకి దిగరని వారు చేయాల్సింది మాత్రం వారు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.  మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.


Also Read: మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్‌.. కారణం ఏంటో తెలుసా?


Also Read: Amma Raja Sekhar: వాడికి డాన్స్‌ రాదు..వాడొక వేస్ట్ ఫెలో..హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ హాట్ కామెంట్స్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook