Nithya Menen's Grand Mother Passed away: స్టార్ హీరోయిన్‌ నిత్యా మీనన్(Nithya Menen) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిత్యా అమ్మమ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్య ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా అమ్మమ్మ, తాతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది నటి. అంతేకాకుండా ''ఒక శకం ముగిసింది. గుడ్‌బై అమ్మమ్మా.. నా చెర్రీమ్యాన్. సీ యూ ఆన్‌ ది అదర్‌ సైడ్‌'' అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ షేర్ చేసిన ఫోటోలో నిత్యని వాళ్ల అమ్మమ్మ ఎంతో అప్యాయంగా దగ్గరకు తీసుకోవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని నటించిన 'అలా మెుదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మెుదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుుంది ఈ కేరళ అమ్మడు. ఆ తర్వాత ఈ బ్యూటీ వెనుదిరుగు చూసుకోలేదు. ఇష్క్‌, ఒక్కడినే, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా బీమ్లా నాయక్‌ మూవీలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటించింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు 50కి పెగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఒక మూవీ, మలయాళంలో ఒక మూవీలో నటిస్తోంది. తన అమ్మమ్మ మరణంతో నిత్యా మీనన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Kushi Update: విజయ్-సమంతల '‘ఖుషి'’ సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు రెడీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook