చెన్నై: దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘భారతీయుడు 2’ షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది గాయపడ్డట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్‌‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని పూనమల్లిలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి ‘ఇండియన్ 2’ సినిమా సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో  ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు


#Indian2 సినిమా షూటింగ్ జరుగుతుండగా  ఒక్కసారిగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ ప్రొడక్షన్ బాయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34), లైట్ బాయ్ చనిపోయారని ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని సవితా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం వార్త తర్వాత  #Indian2 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.


Also Read: నటి టాప్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ షాక్!



డైరెక్టర్ శంకర్ చూస్తుండగానే ఒక్కసారిగా భారీ క్రేన్ కూలిపోయి అసిస్టింట్ డైరెక్టర్లు, మూవీ యూనిట్ సిబ్బందిపై పడిపోయినట్లు ట్వీట్లు చేస్తున్నారు. డైరెక్టర్ మానిటర్‌కు అతి సమీపంలో క్రేన్ పడిపోయింది. దర్శకుడు శంకర్‌ గాయపడ్డారని కొందరు చెబుతుంటే, ఆయనకు ప్రమాదం తప్పిందని ముగ్గురు వ్యక్తులు చనిపోగా, తొమ్మిది మంది సిబ్బంది గాయపడ్డారని సమాచారం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్ సెట్‌లోనే ఉన్నారట.


Also Read: ముగ్గురు సహోద్యోగుల్ని కోల్పోయా: కమల్ హాసన్ భావోద్వేగం


Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!



కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. తెలుగులో ‘భారతీయుడు 2’గా ఈ సినిమా రానుంది. దాదాపు రెండున్నర దశాబ్దాల కిందట శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..