రామ్ గోపాల్ వర్మ ( Ramgopal Varma ) డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ మూవీ ( Thriller movie ) ఆగస్ట్ 14న ఆర్‌జివి వరల్డ్ థియేటర్‌లో, శ్రేయాస్ఈటి (shreyasET)లో విడుదలైన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ శృంగారభరితమైన చిత్రం చాలా సినిమాల తరహాలోనే విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. విడుదలైన కొన్ని గంటలలోనే తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో ఈ సినిమా లీక్ అయింది. Also read : Prabhas: ప్రభాస్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ ఇదేనా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓడియా నటి అప్సరా రాణి ( Actress Apsara Rani ), రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బోల్డ్ పోస్టర్, ట్రైలర్లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. COVID-19 లాక్‌డౌన్ సమయంలో ఆర్జీవీ ( RGV ) విడుదల చేసిన ఇతర సినిమాల లాగే థ్రిల్లర్ మూవీని కూడా ఆడియెన్స్ రూ. 200 చెల్లించి యాప్‌లో సినిమాను వీక్షించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, భోజ్‌పురి, ఒడియా, హిందీ, గుజరాతీలతో సహా తొమ్మిది భాషల్లో విడుదలైంది. Also read : మహేష్ బాబు మేనల్లుడి సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్


క్లైమాక్స్ ( Climax movie ), నేకెడ్ ( Naked movie ), పవర్‌స్టార్ ( Power star movie ) తర్వాత లాక్‌డౌన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన 4వ చిత్రం ఇది. ఆర్‌జివి తరువాతి సినిమా డేంజరస్ ( Dangerour movie )లో కూడా అప్సర రాణి నటించనుంది. ఇందులో అప్సరా రాణి, నైనా గంగూలీలది లెస్బియన్ లవ్ స్టోరీ అని ఆర్‌జివి ట్వీట్ చేసాడు. ఆర్‌జివి థ్రిల్లర్ సినిమా కోసం నటి అంకిత మహారాణా పేరును అప్సర రాణిగా మార్చాడు. అప్సరా రాణి అందాలకు ఆర్జీవీ ఫ్యాన్స్, కుర్రకారు ఫిదా అవుతున్నారు. Also read : Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్‌మెంట్ వార్తల్లో నిజమెంత ?