టాలీవుడ్  నటుడు మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా తరవాత ఆ కుటుంబానికి ఈ సినిమా మరో మైనస్‌గా పరిణమించింది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటీమణులుగా నటించిన జిన్నా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లో మాత్రం వెనుకబడిపోయింది. అయితే ఇటీవల అట్టర్‌ఫ్లాప్ మూవీగా ఘోరంగా విఫలమైన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా కంటే ఫరవాలేదన్పించుకుంది. 


నూతన దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఈ సినిమాకు మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా మోహన్ బాబు కెరీర్‌లోనే అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. జిన్నా సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 15 లక్షల వసూళ్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 4 కోట్లకు అమ్ముడైన ఈ సినిమాకు 3.28 కోట్ల నష్టం వచ్చింది. ఇటీవల కాలంలో ఏదో ఒక వివాదంలో మోహన్ బాబు కుటుంబం ఉండటం కూడా సినిమాపై ప్రభావం చూపించిందని కొందరి అభిప్రాయం.


థియేటర్ విడుదలలో ఘోరమైన డిజాస్టర్ సినిమాగా నిలిచిన జిన్నా సినిమా డిసెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంటే రేపట్నించే అమెజాన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.


Also read: SSMB 28 Movie: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నాటి మేటి నటి రీఎంట్రీ, ఆమె ఎవరో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook