Meena Tested Covid Postive: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. దృశ్యం ఫేమ్, ప్రముఖ నటి మీనా కరోనా బారిన పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సంక్రమణ తీవ్రమవుతోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాలీవుడ్ మేటి నటుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా సోకింది. ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్. ప్రముఖ నటి, దృశ్యం ఫేమ్ మీనా కుటుంబం మొత్తం కరోనా బారినపడింది. కొత్త సంవత్సరంలో మీనా సోషల్ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 


ట్విట్టర్ ఈ విషయాన్ని స్వయంగా ఆమె వినూత్నంగా షేర్ చేశారు 2022లో తన ఇంటికి వచ్చిన తొలి అతిధి మిస్టర్ కరోనా (Coronavirus) అంటూ చమత్కరించారు. కుటుంబం మొత్తాన్ని కరోనా ఇష్టపడిందని..తాను మాత్రం ఇంట్లో చోటివ్వనని చెప్పారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అందరూ బాధ్యతగా మసలుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తికి అవకాశమివ్వద్దని కోరారు. అందరి ప్రార్ధనల్లో చోటివ్వాలని ట్వీట్ చేశారు. వ్యంగ్యంగా చేసిన మీనా పోస్ట్ అందర్నీ ఆక్టుకుంటోంది. మరోవైపు అదే సమయంలో మీనా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..గెట్‌వెల్ సూన్ మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook