Manchu Manoj Corona: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన వారం రోజుల నుంచి నాతో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు'' అని మనోజ్‌ ట్వీట్ (Manoj Tweet) చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా కేసులు (Corona cases in India) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో వరుసపెట్టి  సినీ ప్రముఖులకు కొవిడ్ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ (Kamal Hasan), యాక్షన్ కింగ్ అర్జున్, విక్రమ్, వడివేలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. న్యూ ఇయర్ సందర్భంగా ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు ఇప్పటికే సూచనలు చేశాయి. ప్రస్తుతం మనోజ్.. 'అహం బ్రహ్మస్మి'(aham brahmasmi movie) అనే సినిమాలో నటిస్తున్నారు. కొవిడ్​ కారణంగా కొద్ది రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.


Also Read: Roja Shocking Comments in Nani: "నాని నువ్వు కిరాణాకొట్టే పెట్టుకో.. సినిమాలు వేస్ట్.." యంగ్ హీరోపై రోజా సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook