COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vijayendra Prasad Rajya Sabha: ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందులో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే, పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసింది. దక్షిణాది నుంచి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేయగా అందులో ఇద్దరు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారు కావడం ఆసక్తికరంగా మారింది. 


రాజమౌళి తండ్రిగా విజయేంద్ర ప్రసాద్ సుపరిచితమే కానీ రాజమౌళి కంటే ముందే ఆయన కథారచయితగా సినీ రంగప్రవేశం చేశారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఆయన అనేక తమిళ, హిందీ సినిమాలకు కూడా కథారచయితగా పనిచేశారు. దర్శకుడిగా ఆయన నాలుగు సినిమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరులో జన్మించిన ఆయన 1988 నుంచి రచయితగా కొనసాగుతున్నారు. తొలుత తన సోదరుడు దత్తాతో కలిసి ఆయన కథా రచనలు చేస్తూ వచ్చారు. రాజమౌళి దర్శకుడిగా మారిన తర్వాత ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తూ వచ్చారు.


తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విజయేంద్ర ప్రసాద్ రచన నుంచే పుట్టింది. ఇక ఇళయరాజా గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ, తెలుగు సినిమాల్లో అనేక వందల పాటలు శ్రోతలకు అందించారు. 1970వ సంవత్సరంలో సంగీత దర్శకత్వం మొదలుపెట్టిన ఆయన ఇప్పటికీ తన బాణీలు అందిస్తూనే ఉన్నారు.. ఇక వీరితోపాటు పరుగుల రాణి పీ.ఉషకు కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. అలాగే కర్ణాటక ధర్మశాల దేవస్థానానికి చెందిన ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.


Also Read: Kiraak RP: మల్లెమాల సంస్థపై ఆర్పీ దారుణ వ్యాఖ్యలు.. తల్లి కాదు అంతా వ్యాపారమే.. జైలు తిండే నయమంటూ!


Also Read:  Goutham Raju: గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం.. అండగా ఉంటామని హామీ




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,     వినోదం,     రాజకీయాలు,     విద్య,     ఉద్యోగాలు,     హెల్త్,     లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook