ఇటీవలే తమ వెడ్డింగ్ న్యూస్‌తో యావత్ ప్రపంచాన్ని సడెన్ సర్ ప్రైజ్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలని బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్‌లు మరింత సర్ ప్రైజ్ చేశారు. తాము పెళ్లి చేసుకున్నామని, త్వరలోనే ఢిల్లీలో ఘనంగా తమ రిసెప్షన్ వేడుక జరగనుందని డిసెంబర్ 11న విరుష్క జంట ప్రకటించే వరకు వారి పెళ్లి సంగతి బయటి ప్రపంచానికి తెలియలేదు. అయితే, తమకి వివాహం జరిగిందంటూ ఎప్పుడైతే ఆ జంట అధికారికంగా ప్రకటించిందో.. అప్పటి నుంచే ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరుష్క జంట పెళ్లి వార్త తెలుసుకున్న సన్నిహిత మిత్రులు, బాలీవుడ్, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ బాలీవుడ్‌లో లవ్ బర్డ్స్‌గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ మాత్రం వారికి సోషల్ మీడియాలో ఎటువంటి సందేశాలు ఇవ్వలేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పడంకన్నా.. వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందిస్తేనే బాగుంటుందని భావించిన ఈ జంట.. విరుష్క జంటకు అందమైన గులాబిపూలతో కూడిన ఫ్లవర్ బొకెను.. అంతే అందమైన కంగ్రాట్స్ మెస్సేజ్ ఇచ్చి పంపించినట్టు తెలుస్తోంది. 


సోషల్ మీడియాలో శుభాకాంక్షలు అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకుండా వ్యక్తిగతంగా కొంత సమయం వెచ్చించి మరీ తమకి విషెస్ అందించిన దీపికా, రణ్‌వీర్ సింగ్ పంపించిన గిఫ్ట్ చూసి విరుష్క జంట కూడా ఫిదా అయ్యిందని సమాచారం.