యువతులు, మహిళలు అత్యాచారాలకు గురికావడం చూశాం. ఇప్పుడు సెలబ్రిటీలు, వారి కుమార్తెలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నిన్న అమలాపాల్ లైంగిక వేధింపులకు గురికావడం మరువక ముందే.. నేడు మరో నటి కూడా ఆ జాబితాలో చేరిపోయింది. తెలుగులో బంగారం, జీనియస్, రేణిగుంట చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సనుషాను రైలులో గుర్తుతెలియని వ్యక్తి అత్యాచార ప్రయత్నం చేయబోయాడు.


మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి సనుషా.. కన్నూరు నుండి త్రిసూర్ కు వెళ్లేందుకు రైలు ఎక్కింది. ప్రయాణిస్తున్న రైలులో ఆమె నిద్రిస్తున్న సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అత్యాచార ప్రయత్నం చేయబోయాడు. ఈ విషయాన్ని ఆమె రైల్వేటీసీకి చెప్పగా.. రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మహిళలపై ఇలాంటివి జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు.