అన్ని విషయాల్లో జియోతో పోటీ పడుతున్న ఎయిర్‌ టెల్ ....స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా తన పోటీ వైఖరిని కొనసాగిస్తోంది. ఇటీవలే జియో సంస్థ రూ.1500లకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి పోటీగా ఎయిర్ టెల్ కూడా తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కార్బన్ మొబైల్స్ తో కలిసి సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుద‌ల చేసింది. 'ఏ1 ఇండియన్ ', ' ఏ 41 పవర్' ఫోన్‌లను వ‌రుస‌గా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎయిర్ టెల్ సంస్థ ప్రకటించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల అస‌లు ధ‌రలు రూ.4,390, రూ.4,290 గా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు...


ఎయిర్ టెల్ సీఈవో రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తామకు కార్బన్ తో కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ షాపింగ్ మాల్ అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.