స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా .. 'అల వైకుంఠపురములో..'  ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఈ సినిమాలోని పాటలు అన్నీ మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందించిన పాటలు .. మ్యాజిక్ చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అందుకు యూట్యూబ్ లో ఇప్పటికీ ఈ సినిమా పాటలకు పెరుగుతున్న ప్రేక్షకాదరణే  ఉదాహరణ. సినిమాలోని అన్ని సాంగ్స్ విపరీతమైన వ్యూస్ సొంతం చేసుకున్నారు. అందులో తాజాగా 'రాములో రాముల' కొత్త రికార్డులు సృష్టిస్తోంది.  ఈ పాటను ఆన్ లైన్ లో అక్టోబర్ 26న ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది. ఇప్పటికి ఈ పాటను 201 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.