అహ్మదాబాద్: మద్యానికి బానిసై, విచ్చలవిడిగా ప్రవర్తించిన తాగుబోతును అరెస్టు చేసి లాకప్ లో బంధించారు. కాగా అతని నలుగురు స్నేహితులు స్టేషన్ నుకు చేరుకొన్నారు. కాగా నలుగురిలో ఒక వ్యక్తి లాకప్‌లో తన నలుగురు స్నేహితులతో కలిసి టిక్‌టాక్ వీడియో రికార్డింగ్ చేశారు. దీంతో టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు గుర్తించి ఆ వ్యక్తులను నిబంధనల ప్రకారం ఐటీ చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టు చేసిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Sensex: భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరన్‌సింగ్ షేఖవత్ అనే వ్యక్తి మద్యం కేసులో అరెస్టు కాడంతో పోలీస్ స్టేషన్‌లో ఉంచామని తెలిపారు. షేఖావత్‌ను చూడటానికి నలుగురు స్నేహితులు స్టేషన్‌కు రావడంతో వాళ్లతో కలిసి వీడియో రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారని తెలిపారు.  


Also Read: జడ్పీటీసీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్స్.. జిల్లాల వారీగా వివరాలు


ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు గుర్తించి ఆ నలుగురు స్నేహితులతో పాటు షేఖవత్‌పై కఠినమైన సైబర్ చట్టం ప్రకారం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలో వీడియో తీసినట్టుగా దృశ్యాలు బంధించబడ్డాయని పోలీసులు తెలిపారు. 
.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. Read Also: సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు