COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Hasthinapuram Movie: ప్రస్తుతం యువ హీరో కార్తీక్ రాజు వరస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. అథర్వ మూవీ విడుదలకు ముందుగానే.. మరో మూవీతో బిజీ కాబోతున్నాడు. ఒకవైపు అథర్వ ప్రమోషన్స్ లో పాల్గొంటూ కొత్త ప్రాజెక్టులో బిజీ అవ్వడం తప్పకుండా మరో హిట్ హీరోగా నిలువబోతున్నాడని చెప్పొచ్చు. కాసు రమేష్ నిర్మిస్తున్న కాసు క్రియేషన్ లో భాగంగా హస్తినాపురం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరోగా కార్తీక్ రాజు నటిస్తున్నారు. ఈ ఆస్తినాపురం మూవీకి దర్శకుడిగా గండ్రోతు రాజా వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పనులు పూజా కార్యక్రమం అనంతరం ప్రారంభమయ్యాయి.


ఈ సినిమాను ఫిలింనగర్ లోని దైవసన్నిధానంలో ప్రారంభించగా.. మొదటి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు.  నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా... డైరెక్టర్ ఆదిత్య స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా నిర్మాతలు దర్శకుడు హీరో మాట్లాడుతూ.. వారి అభిప్రాయాలను పంచుకున్నారు.


ఈ సినిమాపై నిర్మాత కాసు రమేష్ మాట్లాడుతూ.."నేను కార్తీక్ రాజు దగ్గర మేకప్ మెన్, మేనేజర్ గా ఉండేవాడిని.. ప్రస్తుతం ఆయన నన్ను నిర్మాతను చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని సంవత్సరాలపాటు మా డైరెక్టర్ రాజా వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. కథలో మంచి కాన్సెప్ట్ ఉంచడం వల్లే నిర్మిస్తున్నాం.. మా చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అని అన్నారు.



డైరెక్టర్ శ్రీనివాస్ భీమనేని మాట్లాడుతూ.. కార్తీక్ రాజా నిషా హీరో హీరోయిన్లుగా.. రాజా దర్శకుడిగా ఈ సినిమా ద్వారా అందరికీ పరిచయం కాబోతున్నారు. వివి వినాయక వద్ద రాజా ఇంతకుముందు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశారు. కార్తీక్ రాజు కూడా మా కౌసల్య కృష్ణమూర్తి తో ఎంతో పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అథర్వ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది.. ఎందుకంటే నేను ఇటీవలే ఆ సినిమాను ఆ కథకు దమ్ముంది." అని అన్నారు.


ఈ సినిమాపై వి ఎస్ ఆదిత్య మాట్లాడుతూ.. "కౌసల్య కృష్ణమూర్తి చూసి రాజుతో ఓ మంచి ప్రేమ స్టోరీని చేశాను. ఈ సినిమా నెక్స్ట్ వాలెంటైన్స్ డే కి ముందు విడుదల కాబోతుంది. ఈ సినిమా ద్వారానే కార్తీక్ రాజుకు మంచి ఇమేజ్ లభించబోతోంది. మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


సినిమాపై కార్తీక్ రాజు మాట్లాడుతూ.. హస్తినాపురం అనే సినిమా త్వరలోనే కొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. ఈ చిత్రం రెగ్యులర్ మూవీస్ లాగా అస్సలు ఉండదు. మా డైరెక్టర్ అద్భుతమైన కాన్సెప్ట్ తో మంచి కథను రెడీ చేశారు. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ హనుమాన్ పాటతో మంచి ట్రెండింగ్ లో ఉన్నారు. మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను." అని అన్నారు.


సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ రాజా ఇంతకుముందు ఉన్న సినిమాల్లా కాకుండా మంచి కథతో మీ ముందుకు రాబోతున్నారు. హీరో కార్తీక్ రాజుతో పనిచేయడం నాకు ఇది రెండోసారి. ఈ హస్తినాపురం చిత్రానికి పనిచేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు." అని అన్నారు.


రాజా మాట్లాడుతూ.." హస్తినాపురం అనే సినిమా పేరు ఎంత పాజిటివిటీగా ఉందో కథ కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. నా గురువు వివి వినాయక్ వద్ద ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశాను. మంచి కథతో, మంచి కాన్సెప్ట్ తో, మంచి టీం తో మీ ముందుకు రాబోతున్నాను. నా మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని అన్నారు.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి