అక్టోబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోన్న సైరా మూవీకి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు చక చక జరిగిపోతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాలం, కన్నడ, ఇలా అన్ని భాషల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో డబ్బింగ్ ప్రక్రియను జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి వెర్షన్ కు తమిళ్ లో ఎవరు డబ్బింగ్ చెబుతారనే సస్పెన్స్ ఉండేది. ఎట్టకేలకు ఈ ఇష్యూ క్లియర్ అయింది. తమిళ సైరాలో మెగాస్టార్ కు అరవింద్ స్వామి డబ్బింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


ధృవ సినిమాతో బాగా క్లోజ్ అయ్యారు అరవింద్ స్వామి, రామ్ చరణ్. పైగా ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి, ఇప్పుడు సైరాకు కూడా డైరక్టర్. సో.. తమిళ వెర్షన్ లో చిరంజీవి వాయిస్ కు అరవింద్ స్వామి అయితే బాగుంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు.. ఈ సినిమాలో కమల్ హాసన్ వాయిస్ కూడా వినిపించబోతోంది. సినిమా స్టార్టింగ్ లో కమల్ హాసన్ వాయిస్ వినిపిస్తుంది. తెలుగులో ఈ వాయిస్ ఓవర్ ను పవన్ కల్యాణ్ ఇచ్చిన విషయం తెలిసిందే.