కరోనా పాజిటివ్ కేసులు ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల వైరస్ వ్యాప్తి చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌కి చెందిన నిర్మాత కరీం మొరానీకి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది. రెండు, మూడు రోజుల క్రితమే ఆయన కూతుళ్లు షాజా మొరాని, జోయా మొరానీలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. జోయా మొరానికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తన ఇంకో కూతురు షాజా మొరానీకి మాత్రం ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ అని లేలిందని కరీం మొరానీ గుర్తు చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి


కరీం మొరానీ కూతురు షాజా మొరానీ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో కూతురు జోయా మొరానీని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. కొద్ది రోజుల క్రితమే జోయా రాజస్తాన్ నుండి ముంబైకి తిరిగి రాగా.. షాజా మొరానీ శ్రీ లంక నుంచి తిరిగొచ్చినట్టు కరీం మొరానీ సోదరుడు మొహమ్మద్ మొరానీ చెప్పినట్టుగా ముంబై మిర్రర్ కథనం పేర్కొంది. 


Also read : Coronavirus car: కరోనా కారు వచ్చేసింది.. పక్కకు పక్కకు జరగండి


హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలె, రా వన్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలకు నిర్మించింది కరీం మొరానీనే. బాలీవుడ్ పరిశ్రమలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో కరీం మొరానికి సన్నిహిత సంబంధాలున్నాయి. బాలీవుడ్‌కి చెందిన వారిలో కరోనావైరస్ బారిన పడిన వారిలో మొదటిది సింగర్ కనికా కపూర్ కాగా కరీం మొరానీ కుటుంబం రెండోది. మొరానీ కుటుంబంలో ఏకంగా ముగ్గురు కరోనా బారినపడటం చూస్తోంటే.. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వైరస్ వ్యాప్తికి ఎలా కారణమవుతుందో అర్థమవుతుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..