మార్చి 18 (ఆదివారం నాడు) విశాఖ వేదికగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే ఈవెంట్‌లో ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకకు మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి పుత్రోత్సహాన్ని కనబరిచారు. ఈ క్రమంలో ఆయన సినిమా కథ గురించి చెబుతూ.. కొంతమేర కథనాన్ని కూడా చెప్పేశారు. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందని.. అయితే కథ మాత్రం రాజకీయ కోణంలో ఉంటుందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుమార్ బాబు (ఆది), చిట్టిబాబు (రామ్ చరణ్) అన్నదమ్ములని.. తన అన్న కుమార్ చనిపోయాక.. చిట్టి ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని ఆయన అన్నారు. దాంతో ఈ సినిమా కూడా రివెంజ్ డ్రామా అన్న క్లూ చిరు ఇచ్చేసిట్లయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన
రంగస్థలం త్వరలోనే విడుదల కానుంది.