సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నెక్ట్ ఏంటి సినిమా టీజర్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'ఫనా', సైఫ్ అలీ ఖాన్-రాణి ముఖర్జీ జంటగా నటించిన హమ్ తుమ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. రైనా జోషి, అక్షయ్ పురి నిర్మించిన ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.