ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మోదీ దిగ్భ్రాంతి
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చనిపోవడం ప్రపంచ చలనచిత్ర, రంగస్థల రంగాలకు తీరని లోటని అన్నారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చనిపోవడం ప్రపంచ చలనచిత్ర, రంగస్థల రంగాలకు తీరని లోటని అన్నారు.
ఇర్ఫాన్ ఖాన్.. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రధాని మోదీ తెలిపారు. అలాంటి వ్యక్తి ఈ రోజు చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన పోషించిన పాత్రల ద్వారా, నటన ద్వారా.. ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు. చలనచిత్ర రంగానికి, రంగస్థలానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిపై ప్రధాని సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..