మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్-సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రంగస్థలం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. చెర్రీ కెరీర్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రంగస్థలం మూవీ నాలుగు మిలియ‌న్ డాల‌ర్ల క్లబ్‌లో చేరేందుకు సన్నద్ధమవుతోంది. అలాగే ప్రపంచ‌వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కూ రూ.175 కోట్ల వసూళ్లు పొందిన తెలుగు చిత్రంగా నిలిచింది. 'బాహుబలి' మూవీ తర్వాతి స్థానంలో  ఇప్పుడు సుకుమార్ సినిమానే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ నిల‌క‌డ‌గా ఉండడంతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరుతుంద‌ని అంటున్నారు సినీ విశ్లేషకులు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ఇటీవలే 'రంగస్థలం' ఓ సక్సెస్ మీట్‌ని  నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌కి చెర్రీ బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగస్థలం సినిమాలో చిట్టి బాబుగా ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ సంపూర్ణమైన నటుడని, పరిశ్రమలోనే కాకుండా బయట కూడా మంచి పేరు సంపాదించుకునే సత్తా చరణ్ సొంతమని,  విజయాలకు పొంగిపోడు.. అపజయాలకు కుంగిపోడని చెర్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు పవన్. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే గర్వించదగిన సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌కి మనస్పూర్తిగా తన అభినందనలు అని తెలిపారు పవన్. రామ్ చరణ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించి..మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని పవన్ ఆకాక్షించారు.