ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. వక్కంతం వంశీ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో ఎమ్మాన్యుయేల్ కథానాయకిగా నటిస్తోంది. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. దేశభక్తి నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన మేకోవర్ ను మార్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో విలన్ గా 'అర్జున్' నటిస్తున్నారు. ఆర్. శరత్ కుమార్ కూడా సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రాత్రి 10:30కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సినిమా దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు మ్యూజిక్ విశాల్-శేఖర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రాజీవ్ రవి.  2018 ఏప్రియల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.